Friday, September 29, 2023

Odisha-365

క్రీడా వార్తలు

  • Asia Cup Bharat Vs Pak: పాకిస్తాన్‌కు 357 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్

    ఆసియాకప్ సూపర్-4లో భాగంగా భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసారు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఇద్దరూ సెంచరీలు చేసి 233 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసారు. మూడో వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం ఆసియాకప్ చరిత్రలోనే అత్యధికం.

    శ్రీలంకలోని కొలంబోలో భారత పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం మొదలైంది. భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. అప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులు, శుభ్‌మన్ గిల్ 58 పరుగులు చేసి ఔట్ అయ్యారు. విరాట్ కోహ్లి 8 పరుగులు, కె ఎల్ రాహుల్ 17 పరుగులు చేసారు. ఆ దశలో మ్యాచ్ నిలిచిపోయింది. రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది.

    ఇవాళ కూడా మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా వాతావరణం బాగోలేక 4.40కి మొదలైంది. మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించడానికే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.

    విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 25.5 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడ్డారు. పాక్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వారిని ఔట్ చేయలేకపోయారు. రాహుల్, కోహ్లీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసారు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 47వ సెంచరీ చేసాడు. అలాగే, వన్డేల్లో 13వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. వన్డే హిస్టరీలో అత్యంత వేగంగా 13వేల పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు.

    మ్యాచ్ 50 ఓవర్లు ముగిసేసరికి విరాట్ కోహ్లీ 122 పరుగులు, కేఎల్ రాహుల్ 111 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 

    P Phaneendra | 19:18 PM, Mon Sep 11, 2023

  • Asia Cup: భారత్ – నేపాల్ మ్యాచ్ మొదలు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

    ఆసియా కప్ టోర్నమెంట్‌లో భాగంగా భారతదేశం నేపాల్ మధ్య మ్యాచ్ మొదలైంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారతజట్టు బౌలింగ్ ఎంచుకుంది.

     భారత జట్టు ఆడుతున్న రెండవ మ్యాచ్ ఇది. మొదటి మ్యాచ్, దాయాది పాకిస్తాన్‌తో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ తన ఇన్నింగ్స్ పూర్తి చేయగలిగినా, వర్షం కారణంగా పాకిస్తాన్ అసలు బ్యాటింగే మొదలుపెట్టలేకపోయింది. ఫలితంగా ఆ మ్యాచ్‌ రద్దయింది. భారత్, పాకిస్తాన్‌ జట్లకు చెరొక పాయింట్ లభించింది.

     అంతకు ముందు నేపాల్‌తో మ్యాచ్ ఆడి గెలిచిన పాకిస్తాన్, మూడు పాయింట్లతో సూపర్ 4 లోకి చేరుకుంది. ఇవాళ నేపాల్‌ భారత్‌తో ఆడుతోంది. భారత్ నేపాల్ మధ్య ఇదే మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్.

    P Phaneendra | 15:13 PM, Mon Sep 04, 2023

  • Praggnanandhaa : చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందకు ఘన స్వాగతం

    చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో రన్నరప్, రజత పతక విజేత ప్రజ్ఞానందకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్ఞానందకు వేల సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. సీఎం స్టాలిన్ ప్రజ్ఞానందను సత్కరించి రూ.30 లక్షల చెక్కు అందజేశారు. దేశం గర్వపడేలా ప్రతిభ కనబరిచాడంటూ ప్రజ్ఞానందను సీఎం స్టాలిన్ కొనియాడారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులతోనూ సీఎం ముచ్చటించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రజ్ఞానందను సత్కరించిన వీడియోను కూడా స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ చూపారని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు. రన్నరప్‌గా నిలిచినందుకు ప్రజ్ఞానందను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఈవీ కారు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్టు ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి ప్రజ్ఞానంద స్పందిస్తూ తన తల్లిదండ్రుల కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

    ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు చెప్పేందుకు కూడా తనకు మాటలు రావడం లేదన్న ప్రజ్ఞానంద, తన తల్లిదండ్రుల చిరకాల కోరిక నిజం చేసినందుకు మహీంద్రా సర్‌కు నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. కార్ల తయారీదారుల అంతిమ లక్ష్యం వినియోగదారుల కలలు నెరవేర్చడమేనంటూ ఆనంద్ మహీంద్రా సమాధానం ఇచ్చారు.

    K Venkateswara Rao | 16:53 PM, Wed Aug 30, 2023

  • Neeraj Chopra: జావెలిన్‌తో నీరజ్ చోప్రా డబుల్ ధమాకా

    హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా డబుల్ ధమాకా సాధించాడు. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లోకి దూసుకువెళ్ళడమే కాక, పారిస్ ఒలింపిక్స్‌కు కూడా క్వాలిఫై అయ్యాడు.

    అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఇవాళ క్వాలిఫయింగ్ రౌండ్ పోటీలు జరిగాయి. అందులో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా పాల్గొన్నాడు. ఈ 25 ఏళ్ళ యువకుడు మొదటి ప్రయత్నంలోనే తన జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసరగలిగాడు. ఈ సీజన్‌లో ఇదే నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే తన కెరీర్‌లో నాలుగో అత్యుత్తమ ప్రదర్శన.

    నీరజ్ చోప్రా ప్రస్తుతం జరుగుతున్న అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకోగలిగాడు. అదే సమయంలో మరో రికార్డునూ సొంతం చేసుకున్నాడు. 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్ పోటీలకు అర్హత సంపాదించుకున్నాడు.

    ప్యారిస్ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్ విండో జులై 1న ప్రారంభమైంది. దానికోసం, జావెలిన్ త్రో ఈవెంట్‌కు నిర్దేశించిన అర్హతా ప్రమాణం 85.5 మీటర్లు. దాన్ని నీరజ్ చోప్రా సునాయాసంగా అధిగమించాడు.

    గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా విజయం సాధించాడు. గతేడాది, అంటే 2022 జూన్‌ 30న స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్ విసిరి విజయం సాధించాడు.

     

    ప్రస్తుతం వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో గ్రూప్ ఎ క్వాలిఫికేషన్ రౌండ్‌లో పాల్గొన్న నీరజ్ చోప్రా, అందులో సునాయాసంగా చోటు సాధించాడు. ఫైనల్‌ పోటీ లేదా మెడల్ రౌండ్‌కి అర్హత సాధించాడు. అంతేకాదు, ప్యారిస్ ఒలింపిక్స్‌కి కూడా అర్హత సాధించాడు. నీరజ్ విజయానికి దేశవిదేశాల్లోని క్రీడాకారులు అభినందించారు.

    P Phaneendra | 15:58 PM, Fri Aug 25, 2023

  • Ind Vs Ire T20 series: నేటినుంచీ ఐర్లాండ్‌లో భారత్ టీ20 సీరీస్

    టీమిండియా మరో టీ20 సీరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచీ ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల పోరాటం మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లు మూడూ డబ్లిన్‌లోని మాలాహైడ్‌ స్టేడియంలో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.  

    ఐర్లాండ్‌తో ఇండియా ఇప్పటివరకూ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడి అన్నీ గెలిచింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో సీరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా ఆడవలసిన అవసరముంది. ఈ సీరీస్‌లో, విండీస్‌తో ఆడిన టీమ్ దాదాపు పూర్తిగా మారిపోతుంది.  

    గాయం కారణంగా సుమారు ఏడాది నుంచీ ఆటకు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా ఈ సీరీస్‌తో మళ్ళీ ఫీల్డ్‌లోకి దిగనున్నాడు. అలాగే, కొద్దికాలంగా సరిగ్గా రాణించలేకపోతున్న సంజూ శాంసన్‌ తన ఫాం నిరూపించుకోవలసిన తరుణమిది. ఆసియా కప్, వరల్డ్ కప్ ఆశావహులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఈ సీరీసే.

    P Phaneendra | 10:58 AM, Fri Aug 18, 2023

  • WEIGHT LIFTING : 62 కేజీల బరువెత్తి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన 8 ఏళ్ల బాలిక


    ఎనిమిదేళ్ల చిన్న వయసులో పిల్లలు చాక్లెట్లు, ఐస్‌క్రీంల కోసం మారాం చేస్తూ ఉంటారు. అయితే హరియాణాకు చెందిన ఎనిమిదేళ్ల అశ్రియా గోస్వామి మాత్రం 62 కేజీల బరువెత్తి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సాధించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచంలో ఎవరూ సాధించలేని ఘనత సాధించింది అశ్రియా గోస్వామి. కేవలం 30 సెకండ్లలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేసి చిన్నారి అశ్రియా గోస్వామి ఈ ఘనత సాధించారు.

    అశ్రియా గోస్వామి తండ్రి అవినాష్‌కుమార్ ఓ జిమ్ నడుపుతున్నారు. గతంలో అశ్రియా తండ్రి వద్దనే వెయిట్‌లిఫ్టింగ్‌లో మెలకువళలు నేర్చుకుంది. ఆ తరవాత ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి అశ్రియాను ప్రోత్సహించారు. అశ్రియా ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్ గుర్మెల్‌సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. జులైలో నిర్వహించిన ప్రముఖ టీవీ లైవ్ షో ఇండియాస్ గాట్ టాలెంట్‌లో అశ్రియా గోస్వామి ఏకంగా 62 కేజీల బరువెత్తి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. అశ్రియా టాలెంట్ చూసిన హరియాణా అసెంబ్లీ స్పీకర్ గుప్తా ఆమెను ఘనంగా సన్మానించారు.

    K Venkateswara Rao | 10:33 AM, Sun Aug 13, 2023

  • World Archery Championship: భారత్‌కు తొలి స్వర్ణం సాధించిన జ్యోతి సురేఖ బృందం

    జర్మనీలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారతదేశం మొదటి స్వర్ణ పతకం సాధించింది. కాంపౌండ్ వుమెన్స్ టీమ్ ఈవెంట్‌ ఫైనల్‌లో వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామి త్రయం విజయం సాధించారు. టాప్‌సీడ్‌ మెక్సికో టీమ్‌ మీద సెకెండ్ సీడ్ ఇండియా టీమ్ 235-229 తేడాతో గెలిచింది.

    ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఎప్పటినుంచో పాల్గొంటున్నా స్వర్ణ పతకం మాత్రం ఇఫ్పటివరకూ సాధించలేదు. ఈ యేడాది పోటీల్లో అన్ని రకాల ఈవెంట్లలోనూ కలిపి భారత్ గెలుచుకున్న మొదటి స్వర్ణ పతకమిది. విజయవాడకు చెందిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామి త్రయం మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసెరా, ఆనా సోఫియా హెర్నాండెజ్‌ జియోన్, డాఫ్నే క్వింటెరో బృందాన్ని ఓడించి పసిడి పతకాన్ని గెలిచారు. ఇక మూడో స్థానంలో కొలంబియా నిలిచింది.

    ఈ పోటీల్లో భారత్ ఇఫ్పటివరకూ 9 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు గెలిచింది. స్వర్ణ పతకం గెలవడం మాత్రం ఇదే మొదటిసారి. దీంతో భారత్ మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

    ఈరోజు, అంటే శనివారం, జరిగే పోటీల్లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్ప్‌లో జ్యోతి సురేఖ తన సహచర క్రీడాకారిణి పర్ణీత్ కౌర్‌తో తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్స్‌లో అదితి గోపీచంద్ స్వామి నెదర్లాండ్స్‌కు చెందిన డి లాత్‌తో పోటీ పడుతుంది.

    Editor | 11:16 AM, Sat Aug 05, 2023

  • Ashes series: యాషెస్ సీరీస్ ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం, సీరీస్ సమం

    ఐదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సీరీస్ సమరంలో ఆఖరి మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. మ్యాచ్ గెలిచి, సీరీస్ సమం చేసింది.

    ఐదవ టెస్ట్ ఆఖరి రోజు ఆస్ట్రేలియా 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 135/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ 94.4 ఓవర్లలో కేవలం 344 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు వార్నర్ (60) ఖ్వాజా (72) పరుగులతో టీమ్‌కు శుభారంభాన్నిచ్చారు. తరవాత స్మిత్ (54) ట్రావిస్ హెడ్ (43) పరుగులు చేసారు. నాలుగో వికెట్‌కు వారిద్దరూ ‌93 పరుగులు జోడించారు.

    అయితే తర్వాత నుంచీ ఆస్ట్రేలియా పతనం వేగంగా కొనసాగింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్‌ మెన్ హెడ్, స్మిత్, మార్ష్, స్టార్క్, కమిన్స్ 300 పరుగుల లోపే ఔట్ అయిపోయారు. కెరీర్ చివరి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ క్రీడాకారుడు స్టువార్ట్ బ్రాడ్, ఆఖరి టెస్ట్‌లో ఆఖరి వికెట్‌గా క్యారీని (28) ఔట్ చేసాడు. దాంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 334 పరుగులతో ముగిసింది.

    ఐదో టెస్టులో ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. సీరీస్‌ను 2-2తో సమం చేసింది. నాలుగు వికెట్లు తీసిన వోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. వోక్స్, స్టార్క్‌లకు ‘ప్లేయర్ ఆఫ్ ది సీరీస్’ అవార్డులు లభించాయి.

    ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, సీరీస్ డ్రా అయినందున, యాషెస్ కప్ వారి వద్దనే ఉండిపోతుంది. తర్వాత యాషెస్ సీరీస్ 2025-26లో జరుగుతుంది.

    Editor | 11:55 AM, Tue Aug 01, 2023

  • ‌మొదటి వన్డేలో విండీస్‌ను మట్టికరిపించిన భారత్

    బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్‌పై టెస్ట్ సీరీస్‌ గెలిచిన భారత్‌ అదే విజయ పరంపరను కొనసాగిస్తోంది. మొదటి వన్డేలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.

     

    మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 23 ఓవర్లలోనే 114 పరుగులకే కుప్పకూలింది. కులదీప్ యాదవ్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి... విండీస్ జట్టు వెన్ను విరిచారు. కెప్టెన్ షై హోప్ 45 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ మూడో ఓవర్లో 2 పరుగులకే హార్దిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్, అథనేజ్‌ ద్వయం కాసేపు నిలదొక్కుకున్నారు. 22 పరుగులు చేసిన అథనేజ్‌ను ఔట్ చేయడం ద్వారా ముఖేష్‌ తన మొదటి వన్డే వికెట్ సాధించాడు. మరుసటి ఓవర్‌లో శార్దూల్‌ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్ 17 పరుగుల దగ్గర ఔటయ్యాడు. తర్వాత భారత స్పిన్నర్ల మాయాజాలానికి విండీస్ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఒంటరిపోరాటం చేసి, దాదాపు చివరివరకూ ఉండి, ఆఖరికి 9వ వికెట్‌గా నిష్క్రమించాడు. మొత్తానికి 23 ఓవర్లలో 114 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ అయింది.

     

    చిన్న లక్ష్యమే కావడంతో భారత్‌ శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌లను ఓపెనర్లుగా దింపింది. శుభ్‌మన్‌ 7 పరుగులకే ఔటయిపోయాడు. ఇషాన్ 46 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు, రవీంద్ర జడేజా 16 పరుగులు చేసారు. ఇండియన్ బ్యాట్స్‌మెన్ 5 వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో 115 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిచారు. అయితే భారత బ్యాటింగ్‌లో సైతం పెద్ద మెరుపులేమీ లేవు. సులువైన ప్రత్యర్ధి, చిన్నదైన లక్ష్యం కావడంతో సీనియర్ ఆటగాళ్ళు బరిలోకి దిగకుండానే మ్యాచ్ పూర్తయింది.

     

    3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన కులదీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 3 వన్డేల సీరీస్‌లో భారత్ 1-0 ఆధిపత్యం సాధించింది.

    Editor | 11:17 AM, Fri Jul 28, 2023

క్రికెట్

  • BHARAT VS AUS ODI CRICKET:  కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య  తొలి వన్డే పోరు

    భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్‌ల  సీరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా ఇరుజట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. తొలి రెండు మ్యాచ్‌లకు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన భారత్, రిజర్వ్ ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. 

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌కు తొలి రెండు మ్యాచ్‌ల సందర్భంగా విశ్రాంతి ఇవ్వగా, కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నారు. శుభమన్ గిల్ తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనుండగా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్ లో దిగుతారు.  

    మొహాలీలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ వేదికపై ఆడిన చివరి ఐదు మ్యాచ్‌లలో నాలుగుసార్లు మొదట బౌలింగ్ చేసిన జట్టు నెగ్గింది, దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

    ఈ స్టేడియంలో నాలుగేళ్ళుగా వన్డే పోటీలు జరగలేదు. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటర్లే పైచేయి సాధించారు. ప్రస్తుతం వర్ష సూచనలేకపోవడంతో పాటు వాతావరణం పొడిగా వేడిగా ఉంది. దీంతో ఎలాంటి అవాంతరం లేకుండా మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ పై అత్యధిక స్కోర్ చేసిన రికార్డు భారత్ పేరిట ఉంది.

    T Ramesh | 11:02 AM, Fri Sep 22, 2023

  • ASIA CUP 2023: పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

    ఆసియాకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ  పోరులో శ్రీలంక విజయం సాధించింది. సూపర్-4 మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 42 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. రాత్రి ఒంటి గంట వరకు మ్యాచ్ కొనసాగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతికి విజయం సాధించి ఆసియాకప్-2023 ఫైనల్‌కు శ్రీలంక అర్హత సాధించింది.

    ఈ విజయంతో ఆసియాకప్ లో 11వ సారి ఫైనల్ కు చేరింది. దీంతో భారత్‌తో ఆదివారం జరగనున్న ఫైనల్ లో శ్రీలంక తలపడనుంది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.

    వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 86 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అబ్దుల్లా షఫీఖ్ (52, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్(47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంకను విజయం వరించింది. కుషాల్ మెండిస్(91), సమరవిక్రమ(48), అసలంక(49 నాటౌట్) శ్రీలంకను విజయం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు.

    T Ramesh | 10:08 AM, Fri Sep 15, 2023

  • BHARAT VS AUS: ఇంగ్లిషు, హిందీతో పాటు 9 దేశీయ భాషల్లో లైవ్

    క్రికెట్ అభిమానులకు రిలయెన్స్ జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో ఆస్ట్రేలియాతో  భారత్ తలపడే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. హిందీ, ఇంగ్లిషుతో పాటు మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.

    ఇందుకోసం ప్రత్యేక కామెంటేటర్స్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుధ్ శ్రీకాంత్, శరణ్‌దీప్ సింగ్ తదితర మాజీ ఆటగాళ్లు ఉన్నారు. సీరిస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్ లో జరగనుంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభం అవుతాయి.

    ఈ సిరీస్ ముగియగానే భారత్ లోనే వన్డే ప్రపంచ కప్ ప్రారంభం అవుతుంది. రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్18 బీసీసీఐ మీడియా హక్కులను రూ.5,963 కోట్లకు దక్కించుకుంది.

    సెప్టెంబర్ 22 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచే వయాకామ్ కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. భారత్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్ లు స్పోర్ట్స్ 18 ఛానల్ లో ప్రసారం కానుండగా, ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.

    T Ramesh | 19:01 PM, Thu Sep 14, 2023

  • Asia Cup Bharat Vs Pak: పాకిస్తాన్‌కు 357 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్

    ఆసియాకప్ సూపర్-4లో భాగంగా భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసారు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఇద్దరూ సెంచరీలు చేసి 233 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసారు. మూడో వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం ఆసియాకప్ చరిత్రలోనే అత్యధికం.

    శ్రీలంకలోని కొలంబోలో భారత పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం మొదలైంది. భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. అప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులు, శుభ్‌మన్ గిల్ 58 పరుగులు చేసి ఔట్ అయ్యారు. విరాట్ కోహ్లి 8 పరుగులు, కె ఎల్ రాహుల్ 17 పరుగులు చేసారు. ఆ దశలో మ్యాచ్ నిలిచిపోయింది. రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది.

    ఇవాళ కూడా మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా వాతావరణం బాగోలేక 4.40కి మొదలైంది. మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించడానికే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.

    విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 25.5 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడ్డారు. పాక్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వారిని ఔట్ చేయలేకపోయారు. రాహుల్, కోహ్లీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసారు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 47వ సెంచరీ చేసాడు. అలాగే, వన్డేల్లో 13వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. వన్డే హిస్టరీలో అత్యంత వేగంగా 13వేల పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు.

    మ్యాచ్ 50 ఓవర్లు ముగిసేసరికి విరాట్ కోహ్లీ 122 పరుగులు, కేఎల్ రాహుల్ 111 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 

    P Phaneendra | 19:18 PM, Mon Sep 11, 2023

  • Asia Cup: భారత్ – నేపాల్ మ్యాచ్ మొదలు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

    ఆసియా కప్ టోర్నమెంట్‌లో భాగంగా భారతదేశం నేపాల్ మధ్య మ్యాచ్ మొదలైంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారతజట్టు బౌలింగ్ ఎంచుకుంది.

     భారత జట్టు ఆడుతున్న రెండవ మ్యాచ్ ఇది. మొదటి మ్యాచ్, దాయాది పాకిస్తాన్‌తో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ తన ఇన్నింగ్స్ పూర్తి చేయగలిగినా, వర్షం కారణంగా పాకిస్తాన్ అసలు బ్యాటింగే మొదలుపెట్టలేకపోయింది. ఫలితంగా ఆ మ్యాచ్‌ రద్దయింది. భారత్, పాకిస్తాన్‌ జట్లకు చెరొక పాయింట్ లభించింది.

     అంతకు ముందు నేపాల్‌తో మ్యాచ్ ఆడి గెలిచిన పాకిస్తాన్, మూడు పాయింట్లతో సూపర్ 4 లోకి చేరుకుంది. ఇవాళ నేపాల్‌ భారత్‌తో ఆడుతోంది. భారత్ నేపాల్ మధ్య ఇదే మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్.

    P Phaneendra | 15:13 PM, Mon Sep 04, 2023

  • Asia cup cricket  2023: భారత్,  పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. సూపర్ 4కు దాయాది జట్టు

    ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంక క్యాండీలోని పల్లెకేలే క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటికే నేపాల్ జట్టు మీద గెలిచిన పాకిస్తాన్ మూడు పాయింట్లతో నేరుగా సూపర్ 4కు చేరింది.

      నేపాల్, భారత్ మధ్య ఈ నెల4న మ్యాచ్ జరగనుంది. ఈ పోటీలో విజయం సాధిస్తే భారత్ కూడా మొత్తం మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరింది. టాచ్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌కు రెండుసార్లు ఆటంకం కల్పించిన వర్షం, ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కూడా పడింది. 267 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగాలనుకున్న పాక్ కు వరుణుడు అడ్డొచ్చాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండేనే మ్చాచ్ ను రద్దు చేశారు.

    భారత ఇన్నింగ్స్ లో హార్థిక్ పాండ్య (87, 90 బంతులో 7x4,1x6)  ఇషాన్ కిషన్ (82, 81 బంతుల్లో 9x4,2x6) గొప్పగా  ఆడారు. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ దాటికి మొదట్లో తడబడ్డ టీమిండియా తర్వాత నిలదొక్కుకుంది. ఇప్పటికే నేపాల్ పై నెగ్గిన పాక్.. ఈ మ్యాచ్ రద్దు కావడంతో సూపర్-4కు అర్హత సాధించింది.

    T Ramesh | 12:57 PM, Sun Sep 03, 2023

ఫుట్‌బాల్

హాకీ

కబడ్డీ

google-add

భారతీయం

google-add
google-add
google-add